మహ్మదాబాద్, ఫిబ్రవరి 27: కృష్ణమూర్తి అనే పోస్టల్ ఉద్యోగి మంగళవారం మహబూబ్నగర్ హెడ్ పోస్టాఫీస్ నుంచి రూ.10 లక్షల నగదును బైక్పై తీసుకెళ్తుండగా, మహ్మదాబాద్ మండ లం నంచర్ల వద్ద బైక్ అదుపు తప్పి కిందపడటంతో అతడికి గాయాలయ్యాయి. 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యంకోసం మహబూబ్నగర్ తరలించారు. అతడి వద్ద ఉన్న 10 లక్షలను ఈఎంటీ లక్ష్మీనారాయణ, పైలట్ చాంద్ పాషా కృష్ణమూర్తి తోటి ఉద్యోగులకు అందజేశారు.