వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తుడు కావలి అశోక్ మంత్రి నిరంజన్రెడ్డిపై అభిమానాన్ని చాటుకున్నాడు. త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నిరంజన్రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందాలని కాంక్షిస్తూ శబరిమలకు మహాపాదయాత్ర చేపట్టాడు.
మంగళవారం తెల్లవారుజామున జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయం నుంచి యాత్రకు శ్రీకారం చుట్టాడు. 1,170 కిలోమీటర్ల దూరంలోని శబరిమలకు 30 రోజుల్లో చేరుకునేలా ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పాడు.
–పెబ్బేరు