Bhupalpally | మహదేవపూర్, జనవరి 3: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించ గా అడ్డుకోబోయిన తల్లిపై గొడ్డలి వేటుపడ టంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో బుధవారం చోటుచేసుకున్నది.
అంబట్పల్లికి చెందిన నరసింహస్వామి.. తన భార్యతో అదే గ్రామానికి చెందిన నల్ల అవినాశ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైనా అవినాశ్ను అంతమొందించాలని నరసింహిస్వామి పథకం వేసుకుని అతని ఇంటికెళ్లాడు. అక్కడ అవినాశ్పై దాడిచేయబోతుండగా.. అడ్డుకోబోయిన అతని తల్లి నల్ల పద్మ (45)పై గొడ్డలి వేటుపడింది. తీవ్రంగా గాయపడిన పద్మను స్థానికులు ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీఐ కిరణ్కుమార్, ఎస్సై రాజ్కుమార్ తెలిపారు.