Amrit Bharat Station | హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై అడుగడుగునా వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం.. అమృత్ స్టేషన్ల ఎంపిక విషయంలోనూ అదే ధోరణి ప్రదర్శించింది. 26న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 554 అమృత్ స్టేషన్ల నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేశారు.
వీటిలో ఏపీ నుంచి 34, తెలంగాణ నుంచి 15 స్టేషన్లే ఎంపిక చేశారు. రాష్ట్రంలో 15 అమృత్ స్టేషన్ల ఏర్పాటుకు రూ.230. 24 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఏపీలో 34 అమృత్ స్టేషన్లకు రూ.613. 30 కోట్లు కేటాయించింది.