శాంతిభద్రతలు కట్టుదిట్టమని చెప్పానన్న సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 13 : అసదుద్దీన్ ఒవైసీ భద్రత గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆదివారం ప్రగతిభవన్లో మీడియా సమావేశం చివరన ఆయన ఈ విషయం వెల్లడించారు. శాంతిభద్రతల అంశంలో కట్టుదిట్టంగా ఉన్నామని, తెలంగాణాలో మతపరమైన దాడులు జరిగే అవకాశంలేదని కేంద్రహోంమంత్రికి స్పష్టం చేశానని వివరించారు.