హైదరాబాద్: హైదరాబాద్లోని హకీంపేట నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (NISA)లో సీఐఎస్ఎఫ్ (CISF) 54వ రైజింగ్ డే పరేడ్ (Raising Day Parade) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah) హాజరయ్యారు. అమరులకు నివాళులర్పించిన అమిత్ షా.. సీఐఎస్ఎఫ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. 53 ఏండ్లుగా దేశ సేవలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తున్నదని చెప్పారు. దేశాన్ని రక్షించడంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది సాధించిన విజయాలకు భారతదేశం గర్విస్తుందన్నారు. విధుల్లో భాగంగా చాలా మంది సిబ్బంది తమ ప్రాణాలను అర్పించారని చెప్పారు. సీఐఎస్ఎఫ్కి అవసరమైన సాంకేంతిక పరిజ్ఞాన్ని సమకూర్చడంలో అన్నిరకాలుగా సహకారం అందిస్తామన్నారు. డ్రోన్ టెక్నాలజీని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు.
#WATCH | 54th CISF Raising Day celebrations being held at CISF NISA, Hyderabad pic.twitter.com/phwCzem1Tb
— ANI (@ANI) March 12, 2023
1969, మార్చి 10న 3 వేల సిబ్బందితో సీఐఎస్ఎఫ్ మొదలైందని, ప్రస్తుతం లక్షా 80 వేల మంది పనిచేస్తున్నారని తెలిపారు. దేశానికి పటిష్ఠ భద్రతా సేవలు అందిస్తున్నారని అన్నారు. సీఐఎస్ఎఫ్ పోలీసుల వల్లే దేశంలో నక్సలైట్లు, ఉగ్రవాదుల కార్యకలాపాలను అదుపుచేయగలిగామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, డీజీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు.
— CISF (@CISFHQrs) March 12, 2023