హైదరాబాద్: హైదరాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (NPA) 75వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ (IPS Passing-out parade) ఘనంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, డీజీపీ అంజనీ కుమార్ కూడా పాల్గొన్నారు. నూతన ఐపీఎస్ల నుంచి అమిత్ షా గౌరవ వందనం స్వీకరించారు.
ఈ బ్యాచ్లో 175 మంది ట్రైనీ ఐపీఎస్లు శిక్షణ పూర్తిచేసుకున్నారు. అందులో దేశానికి చెందిన 155 మందితోపాటు, 20 మంది ఫారెన్ ట్రైనీ ఆఫీసర్లు ఉన్నారు. 155 మంది ఐపీఎస్లలో 123 మంది పురుషులు, 32 మంది మహిళా ఐపీఎస్లు శిక్షణ పొందారు. ఇతర ఉద్యోగాలు చే మొత్తం ట్రైనింగ్లో ఇండోర్, ఔట్ డోర్ ఫిజికల్కు సంబంధించి 102 వారాల పాటు శిక్షణ పొందారు.
తెలంగాణ క్యాడర్కు 9 మంది ట్రైనీ ఐపీఎస్లను కేటాయించారు. వీరిలో తెలంగాణకు చెందిన నలుగురు ఉండగా.. ఇతర రాష్ర్టాలకు చెందినవారు ఐదుగురు ఉన్నారు. 2022 బ్యాచ్లో తెలంగాణ నుంచి ఐదుగురు ఎంపిక కాగా, నలుగురిని రాష్ట్ర క్యాడర్కు, ఒకరిని వేరే రాష్ర్టానికి కేటాయించారు. తెలంగాణకు కేటాయించినవారిలో బీ చైతన్యరెడ్డి, పీ మౌనిక, కే రాహుల్రెడ్డి, ఎస్ చిత్తరంజన్, శుభమన్ నగరాలె, కాజల్, రాజేశ్ మీనన్, విక్రాంత్కుమార్సింగ్, చేతన్ మీనన్ ఉన్నారు.
#WATCH | Hyderabad: Union Home Minister Amit Shah attends the passing-out parade of the 75th batch of Indian Police Service (IPS) probationers. pic.twitter.com/bd6RRnjgBh
— ANI (@ANI) October 27, 2023