నల్లగొండ, డిసెంబర్ 31 : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు గుత్తా అమిత్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు నల్లగొండలో శనివారం ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో నిర్వహించిన రక్తదానం శిబిరంలో అమిత్రెడ్డితోపాటు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఆయన అక్కడే అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. అంతకుముందు చలసాని రాజీవ్తోపాటు కార్యకర్తలు అమిత్ను గజమాలతో సన్మానించారు. లెప్రసీ హెల్త్ కేర్ సెంటర్లో రోగులతో కలిసి అమిత్రెడ్డి కేక్ కట్ చేశారు. హాస్పిటల్కు రూ.3.75 లక్షలు విరాళం అందజేశారు. హెల్త్ సెంటర్ సిబ్బంది విజ్ఞప్తి మేరకు ఇద్దరికి వారం రోజుల్లో ట్రై సైకిళ్లు అందజేస్తానని హామీ ఇచ్చారు. వారితో కలిసి సతీసమేతంగా భోజనం చేశారు. ఈ సందర్భంగా అమిత్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్తోపాటు తన తండ్రి గుత్తా సుఖేందర్రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ.. బీఆర్ఎస్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. చిట్యాల మండలం ఉరుమడ్లలో మొక్కలు నాటిన ఆయన చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథాశ్రమానికి రూ.లక్ష విరాళం అందజేశారు. జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి అమిత్రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి సేవా కార్యక్రమాలను కొనియాడారు. కార్యక్రమంలో గుత్తా అఖిల, తిప్పర్తి, కనగల్ జడ్పీటీసీ సభ్యులు పాశం రాంరెడ్డి, చిట్ల వెంకటేశం, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.