Layoffs | హైదరాబాద్ (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): ఉద్యోగాల కోత ఫార్మా, టెలి కమ్యూనికేషన్, ఈ-కామర్స్, ఫైనాన్స్, విమానయానం, డెలివరీ, ఎడ్టెక్, ట్రావెల్స్, మార్కెటింగ్ ఇలా అన్ని రంగాలకూ విస్తరించింది. దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్ 1,400 మంది ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. అమెరికాకు చెందిన కమ్యూనికేషన్స్ సంస్థ సిస్కో వేలాదిమందిని తొలగించ బోతున్నది.
కోతల్లో నంబర్ 2 మనమే
గడిచిన రెండేండ్లుగా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత పెరిగిపోయింది. ముఖ్యంగా 2023ను ఉద్యోగుల తొలగింపునామ సంవత్సరంగా పిలిచారు. కారణం.. ఆ ఒక్క ఏడాదే ప్రపంచవ్యాప్తంగా 2.62 లక్షల మంది టెక్ ఉద్యోగులు తమ కొలువులను కోల్పోయారు. ఇందులో 70 శాతం కోతలతో అమెరికా తొలిస్థానంలో ఉండగా, తర్వాతి స్థానంలో భారత్ నిలిచింది. ఆ ఏడాది భారత్లో 18 వేల టెక్ ఉద్యోగాలు గాయబ్ అయ్యాయి.
ఈ మేరకు లేఆఫ్-ఫై వెబ్సైట్ తన నివేదికలో వెల్లడించింది. ఇక, ఈ ఏడాది కూడా ఉద్యోగాల కోతలు తారాస్థాయికి చేరనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి.
భారత్లో కొలువుల కోతలు ఎక్కువగా జరిగిన టెక్ కంపెనీలు
ఉద్యోగాల కోతలు గడిచిన ఐదేండ్లలో భారత్లో టెక్ రంగంలోని ఉద్యోగుల తొలగింపు (ఫిబ్రవరి 9నాటికి)
గడిచిన మూడేండ్లలో ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలోని ఉద్యోగుల తొలగింపు (ఫిబ్రవరి 9నాటికి)