ఖమ్మం: జిల్లాలోని ముదిగొండ మండలం మేడేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. సాగర్ కాలువలో కొట్టుకుపోతున్న పిల్లలను కాపాడబోయిన ఓ తండ్రి కన్నుమూశాడు. మేడేపల్లి గ్రామానికి చెందిన కొల్లు సురేష్ కుమార్.. ఇవాళ తన పిల్లలకు సాగర్ కాలువలో ఈత నేర్పిస్తున్నాడు. ఈ క్రమంలో పిల్లలు కాలువలో కొట్టుకుపోతుండగా వారిని కాపాడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆయన నీటిలో మునిగి మరణించాడు. కాగా, పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..