కరెన్సీ నోట్లపై అంబేదర్ ఫొటోను ముద్రించాలని, ఈ విషయమై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాయాలని కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ సీఎం కేసీఆర్కు వినతిపత్రం సమర్పించారు. గురువారం ఢిల్లీలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. ఆయనవెంట ఆళ్ల రామకృష్ణ తదితరులు ఉన్నారు.