హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు శనివారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన చేపట్టారు. తమ ఉద్యమం ప్రారంభించి మూడేండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ నిరసనకు టీడీపీ, కాంగ్రెస్, జనసేన, సీపీఐ నేతలు మద్దతు పలికారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో ఆది, సోమవారాల్లో వివిధ పార్టీల నేతలను అమరావతి రైతులు కలువనున్నారు. సోమవారం రాంలీలా మైదానంలో జరిగే భారతీయ కిసాన్ సంఘ్ ర్యాలీలో వీరు పాల్గొననున్నారు. రాజధాని నిర్మాణానికి వందలాది మంది రైతులు త్యాగం చేశారని, ప్రధాని మోదీ జోక్యం చేసుకొని అమరావతి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.