హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా నేడు మెడికల్ షాపుల బంద్కు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపునిచ్చిన నేపథ్యంలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ ఆదేశించారు.
పీహెచ్సీలు, బస్తీ దవాఖానలు సహా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో బుధవా రం 24 గంటలపాటు ఫార్మసీలు ఓపెన్ చేసి ఉంచేలా చూడాలని పేర్కొన్నారు.