హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్సెట్ ప్రత్యేక విడత వెబ్కౌన్సెలింగ్ సీట్లను మంగళవారం కేటాయించారు. మొత్తం 2,604 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకొన్నారు. 6,419 సీట్లకు 3,988 మంది విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరయ్యారు.
వీరిలో 2,604 మంది విద్యార్థులు కొత్తగా సీట్లు పొందారు. సీట్లు పొందిన వారు ఈ నెల 17లోపు ఫీజు చెల్లించి కాలేజీల్లో రిపోర్ట్చేయాలని అధికారులు సూచించారు. మొత్తం 13,405 సీట్లుండగా, మొదటి విడతలో 4,674, రెండో విడతలో 3,578 మంది విద్యార్థులు ఇప్పటికే సీట్లు పొందారు.