IAS-IPS Officers | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేంద్రం షాక్ ఇచ్చింది. తెలంగాణలో కొనసాగుతున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఏపీ కేడర్కు కేటాయించింది. ఈ మేరకు ఆయా అధికారులు వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా కొనసాగుతున్న ఆమ్రపాలి కాట, విద్యుత్ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న రోనాల్డ్ రోస్, వాణిప్రసాద్, వాకాటి కరుణ, మల్లెల ప్రశాంతితో పాటు పలువురు అధికారులను ఏపీ కేడర్కు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐఏఎస్ అధికారుల పేరుతో లేఖను రాస్తూ.. వాటి కాపీలను తెలంగాణ, ఏపీ చీఫ్ సెక్రెటరీలకు కేంద్రం పంపింది. అయితే, తెలంగాణ కేడర్ కావాలంటూ 11 మంది అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే, అధికారుల వినతిని కేంద్రం తిరస్కరించింది. అధికారులంతా సొంత రాష్ట్రంలో 16లోగా రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
ఐపీఎస్లు అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మొహంతిని కేంద్రం ఆదేశించింది. ఏపీ, తెలంగాణ కేడర్ విభజనపై కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇదిలా ఉండగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిన అనంతరం ఆమ్రపాలి కేంద్ర సర్వీసుల నుంచి తెలంగాణ సర్వీసుల్లో చేరారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్, మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్, హెచ్జీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కమిషనర్గా కొనసాగుతున్న సమయంలోనే జీహెచ్ఎంసీ కమిషనర్ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో ఎంతో మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నప్పటికీ ఆమెకే ఐదు కీలక పోస్టులను సీఎం రేవంత్రెడ్డి కేటాయించారు. ఆ తర్వాత జరిగిన బదిలీల్లో మిగతా పోస్టులను నుంచి ఆమెను జీహెచ్ఎంసీ కమిషనర్గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. తాజా కేంద్రం నిర్ణయంతో ఆమె ఏపీకి వెళ్లనున్నారు. ఇది సీఎం రేవంత్రెడ్డికి ఓ విధంగా షాక్ అనే చెప్పాలి.