హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మించనున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్కు ప్రభుత్వం 10 ఎకరాల భూమిని కేటాయించింది. భువనగిరి మండలం రాయగిరి గ్రామంలోని సర్వే నంబర్ 259లో ఈ స్థలాన్ని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ (స్టేడియం) నిర్మించనున్నది. ఇందుకోసం ప్రభుత్వానికి రూ.95 లక్షలు చెల్లించింది.