హైదరాబాద్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్ఆర్నగర్లోని ఆయన నివాసంలో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను కలిసి క్లిమామ్ గోశాల ఉత్పత్తులను అందించారు. దేశీ జాతి ఆవులను సంరక్షించాలనే లక్ష్యంతో క్లిమోమ్ వెల్నెస్ అండ్ ఫార్మ్స్ని 2015లో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ముఖ్యంగా చిన్న పిల్లలకు స్వచ్ఛమైన ఏ2 మిల్క్ ను అందించాలనే ఉద్దేశంతో గోశాలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
జన్యు సంపద, స్థానిక పరిస్థితులను తట్టుకుంటూ ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండి.. తక్కువ ఖర్చుతో పోషించగలిగే.. దేశీయ జాతి ఆవులు సేంద్రియ వ్యవసాయానికి వెన్నుముకలాంటివని.. దేశీయ సంపద కనుమరుగైపోకుండా.. వాటిని పరిరక్షించి, భవిష్యత్ తరాలకు ఈ సంపాదనను అందించాల్సిన కర్తవ్యంతో పని చేస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యంగా, పుష్టిగా ఉండే దేశ వాళీ ఆవులనే సంకర జాతి ఆవుల సంతతి కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారని, క్రాస్ బ్రీడింగ్ విధానాలతో దేశీ జాతి ఆవుల ఉనికి ప్రమాదంలో పడిందన్నారు. ఇలాంటి పద్ధతులకు ఆపాలని, పవిత్రమైన ఆవును జాతీయ సంపద గుర్తించడానికి తాము చేస్తున్న ప్రయత్నానికి మద్దతు ఇవ్వాలని సీజేఐని అభ్యర్థించారు.