హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): వచ్చే రెండు నెలల్లో అన్ని ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరిస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ప్రకటించా రు. బుధవారం వర్చువల్గా మీడియాతో మా ట్లాడుతూ.. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం కేంద్రం పరిధిలో ఉన్నదని చెప్పారు. ప్రస్తుతం కాజీపేట్లో వ్యాగన్ వర్క్షాపు పను లు కొనసాగుతున్నాయన్నారు. మౌలాలి నుంచి సనత్నగర్ వరకు డబ్లింగ్ పనులు జరుగుతున్నాయని ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్లో 55 ఎంఎంటీఎస్ లోకల్ రైళ్లు నడుస్తున్నాయని, త్వరలోనే మరో 30 సర్వీసులను పునఃప్రారంభిస్తామన్నారు.