సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 27: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ను వ్యతిరేకించిన కాంగ్రెస్, నేడు పాలకపక్షంలోకి వచ్చాక ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన మాట్లా డుతూ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని, మార్చిలోపు లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు.
లేఅవుట్ల క్రమబద్ధీకరణలో భాగంగా పేదలు నిర్మించుకునే ఇండ్ల అనుమతులు, రుణాల మంజూరుకు సంబంధించిన అనుమతుల సులభతరం కోసమే కేసీఆర్ సర్కార్ ఎల్ఆర్ఎస్ను అమల్లోకి తెచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇచ్చి న హామీలను అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నేతలు విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ను అమలుచేయాలని డిమాండ్ చేశారు.