హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) అన్నీ త్వరలో ‘లైవ్’లోకి రానున్నాయి. ఏ పీహెచ్సీని అయినా.. ఏ సమయంలోనైనా హైదరాబాద్ నుంచే పరిశీలించేందుకు అవకాశం కలుగనున్నది. రాష్ట్రంలో 729 పీహెచ్సీలు ఉన్నాయి. వీటన్నింటిలో ఇప్పటికే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డాక్టర్ గది, ఫార్మసీ, ల్యాబ్లో ఒక్కో కెమెరా చొప్పున ప్రతి పీహెచ్సీకి మూడు కెమెరాలను బిగించారు. ఆయా పీహెచ్సీలకు ఇప్పటికే వైఫై కనెక్షన్ ఇచ్చారు. సీసీ కెమెరాన్నింటినీ వైఫైతో కనెక్ట్ చేసి ‘ఆన్లైన్’లోకి తెస్తున్నారు. పర్యవేక్షణ కోసం సచివాలయంలో, కోఠిలోని డీపీహెచ్ ఆఫీస్లో కంట్రోల్ సెంటర్లను ఏర్పాటుచేశారు. నిఘా కోసమే కాకుండా నేరుగా సిబ్బందితో మాట్లాడేలా ఆడియో, విజువల్ సీసీ కెమెరాలను అమర్చారు. సాఫ్ట్వేర్, సీసీ కెమెరాలు ఇతర పరికరాల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం ఈసీఐఎల్కు అప్పగించింది. ప్రస్తుతం ట్రయల్స్ నడుస్తున్నాయి. ఈ సందర్భంగా ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను సిబ్బంది పరిష్కరిస్తున్నారు. ఇవి ప్రారంభం అయితే ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటివరకు 500కుపైగా పీహెచ్సీలు ఆన్లైన్లోకి వచ్చాయి.
సీసీ కెమెరాలతో ఉపయోగాలు: