హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురసరించుకొని మంగళవారం సామూహిక జాతీయగీతాలాపన చేపట్టనున్నా రు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. అబిడ్స్ జీపీవో సరిల్, నెక్లెస్రోడ్ వాటర్ ఫ్రంట్ కూడలి తదితర ప్రాంతాల్లో నిర్వహించే జాతీయ గీతాలాపన ఏర్పాట్లను సీఎస్ సోమేశ్కుమార్ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా, హైదరాబాద్లోని ప్రధాన కూడళ్లలో సామూహిక గీతాలాపనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఉదయం 11.30 గంటలకు జాతీయ గీతాలాపన ప్రారంభమవుతుందని, సీఎం కేసీఆర్ సైతం నగరంలోని ఓ ప్రధాన కూడలిలో పాల్గొంటారని తెలిపారు.
అబిడ్స్ జీపీవో సర్కిల్ వద్ద జరిగే కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలను ప్రదర్శించాలని, మైకు లు, రంగురంగుల బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఉద్యోగులు, కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను సూచించారు. సీఎస్తోపాటు ఏర్పాట్లను పరిశీలించిన వారిలో జీఏడీ కార్యదర్శి శేషాద్రి, అడిషనల్ డీజీపీ జితేందర్, పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఉన్నతవిద్య కమిషనర్ నవీన్ మిట్టల్, కార్యదర్శి వాకాటి కరుణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్, హైదరాబాద్ కలెక్టర్ అమోయ్కుమార్, సీపీ సీవీ ఆనంద్ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.