హైదరాబాద్ : గ్రామాల్లో మౌళికసదుపాయాల(Basic Needs)ను కల్పిస్తూ అధికారులు నిబద్దతతో, అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి అనసూయ సీతక్క (Minister Sitakka) అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియట్లో తన శాఖా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో ఎలాంటి జాప్యం జరగకూడదని సూచించారు.
కిందిస్థాయి అధికారులు కూడా శాఖ పురోగతికి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసేందుకు సూచనలు, సలహాలను ఇవ్వాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలతో అధికారులకు వివరించడానికి వస్తే వెంటనే పరిష్కరించాలని , కార్యాలయాలకు తిప్పుకోవద్దని ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి అధికారుల రెండునెలల జీతాల కోసం రూ. 46 కోట్లను ఆమె విడుదల చేశారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.