హయత్నగర్, మార్చి 5: నేతన్నలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ పిలుపునిచ్చారు. హైదరాబాద్ హయత్నగర్ డివిజన్ పరిధిలోని కర్నాటి గార్డెన్స్లో ఆదివారం జరిగిన ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్, హైదరాబాద్ ప్రాంత చేనేతల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచి భవిష్యత్ కలిగిన యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలని పేర్కొన్నారు. 19 చేనేత కులాలు ఐక్యంగా తమ వృత్తి సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ చొరవతో పద్మశాలీలకు నేతన్నకు బీమా పథకం అమలవుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రాపోలు ఆనంద్భాస్కర్, జెల్లా మార్కండేయులు, ఫెడరేషన్ల ప్రతినిధులు కటకం నర్సింగ్రావు, వేముల బాలరాజు, వనం శాంతికుమార్, బండారు ఆనందప్రసాద్, బొమ్మ రఘురాం నేత, రాపోలు జ్ఞానేశ్వర్, జీ శ్రావణ్కుమార్, జీ వెంకటేశ్వర్లు, గవ్వల శంకర్, వీ పరమేశ్, బోగం లక్ష్మయ్య, పీ సవిత, వెంకటేశ్వరరావు, చెరుకు స్వామి, రాపోలు జగన్ తదితరులు పాల్గొన్నారు.