హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): నీట్-2023 ఫలితాల్లో తమ విద్యాసంస్థకు చెందిన విద్యార్థి బోరా వరుణ్ చక్రవర్తి 720 మార్కులకుగాను 720 మార్కులతో ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో మొదటి ర్యాంకు సాధించినట్టు శ్రీచైతన్య విద్యా సంస్థ వెల్లడించింది. 715 మార్కులతో ఎస్ వరుణ్ ఆలిండియా 9వ ర్యాంకు, కంచ ని రఘురామారెడ్డి 15వ ర్యాంకు సాధించారని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆల్ క్యాటగిరీల్లో 1, 1, 1, 2, 3 ,3, 5, 7, 9 ర్యాంకులు తమ విద్యార్థులే సాధించినట్టు పేర్కొన్నది.