హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : పెన్షన్భారం పెరుగుతోందన్న సాకుతో పాత పింఛన్ను రద్దు చేసి సీపీఎస్ను అమలు చేయడం దుర్మార్గమని, దీనిపై రాజకీయపార్టీలు తమ విధానాన్ని, వైఖరిని ప్రకటించాలని ఆలిండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్టీఎఫ్) ప్రశ్నించింది.
హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన ఏఐఎస్టీఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షుడు ఇంద్రశేఖర్ మిశ్రా మాట్లాడుతూ ఐదేండ్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేసిన వారు పెన్షన్ పొందుతుండగా, మూడు దశాబ్దాలు ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ను రుద్దడం సరికాదని అన్నారు. ఈ సమావేశంలో సంస్థ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి నర్సింహారెడ్డి, సెక్రటరీ జనరల్ సదానందంగౌడ్, జోసఫ్ సుధీర్బాబు, అన్సారీ, ఎల్ సాయిశ్రీనివాస్, ఎం రఘునాథరెడ్డి, పర్వత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.