Revanth Reddy | హుస్నాబాద్, అక్టోబర్ 28: కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తనను రెండుసార్లు నమ్మించి గొంతు కోసిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని తన నివాసంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. స్థానిక నాయకులు అసమర్థులుగా, స్థానికేతరులు సమర్థులుగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. రెండు రోజుల్లో కార్యచరణ ప్రకటిస్తామని చెప్పారు. పొన్నం ప్రభాకర్ శనివారం అల్గిరెడ్డి ఇంటికి వెళ్లి మద్దతు కోరగా, అందుకు ఆయన తిరస్కరించినట్టు తెలిసింది.