హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్పార్టీలో పాదయాత్రల లొల్లి ముదిరింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి జరపాలని తలపెట్టిన పాదయాత్రను అర్ధంతరంగా నిలిపివేయాలని ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్థాక్రే చెప్పారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మహేశ్వర్రెడ్డి రాసిన లేఖ పార్టీలో కలకలం రేపింది. పార్టీకి కట్టుబడి పనిచేసే తన పాదయాత్ర ఆపటం కలిచివేసిందని లేఖలో పేర్కొన్నారు. తాను సొంత ఎజెండాతో యాత్ర చేయటం లేదని వివరించారు. తన పాదయాత్ర ఆపేయటం వెనుక ఎవరున్నారో చెప్పాలని మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు.