జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీపురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్లో భారత స్టార్ షూటర్లు స్వర్ణ, రజతాలు దక్కించుకున్నారు. 460 పాయింట్లతో అఖిల్ షెరాన్ పసిడి పతకం గెలుచుకోగా.. ఇదే విభాగంలో టోక్యో ఒలింపియన్ ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ 459 పాయింట్లతో రజతం కైవసం చేసుకున్నాడు. ఈ చాంపియన్షిప్లో ఇప్పటి వరకు మన షూటర్లు 24 పతకాలు నెగ్గారు. అందులో 10 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి.