హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఈ నెల 28 నుంచి 30 వరకు అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ్) సమావేశాలు కోల్కతాలో జరుగనున్నాయని టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ వెల్లడించారు. సభల సన్నాహక సమావేశం హైదరాబాద్లో ఆయన అధ్యక్షతన మంగళవారం జరిగింది.
రాష్ట్రం నుంచి 105 మంది ప్రతినిధులు ఈ సభలకు హాజరుకానున్నట్టు తెలిపారు. సమావేశంలో అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్, కోశాధికారి రామినేని శ్రీనివాస్రావు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ, లక్ష్మణ్, శ్రీనివాస్రెడ్డి, ఆకుల రాజేందర్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.