టీ-ఫైబర్ పథకంలో కలిసి పనిచేద్దాం
ఎయిర్టెల్ అధిపతులతో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో డాటా కేంద్రాలు ఏర్పాటు చేయాలని భారతీ ఎంటర్ప్రైజెస్ (ఎయిర్టెల్) సంస్థకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా మంగళవారం తెలంగాణ పెవిలియన్లో ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, వైస్ చైర్మన్ రాజన్ భారతీ మిట్టల్ మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తెలంగా ణ ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే ఉద్దేశంతో చేపట్టిన టీ-ఫైబర్ పథకంలో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. టీ-ఫైబర్ ఉద్దేశాలు, దానివల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరించారు. శాస్త్ర, సాంకేతిక రంగా ల్లో తెలంగాణ ప్రగతిని వివరిస్తూ, రాష్ట్రంలో ఎయిర్టెల్ డాటా కేంద్రాలను నెలకొల్పాలని కోరారు.