న్యూఢిల్లీ, జూన్ 14: భారత్లో ప్రజారోగ్యానికి వాయు కాలుష్యం పెనుముప్పుగా పరిణమిస్తున్నది. పారిశ్రామికీకరణ, అధిక వాహనాలతో పెరిగిన ఇంధన వినియోగం.. ఇలా కారణం ఏదైతేనేం దేశంలో గాలి కాలుష్య తీవ్రత అధిక స్థాయిలో పెరిగిపోతున్నది. కాలుష్యం కారణంగా వచ్చే అనారోగ్యంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే సమయంలో విపరీతమైన ఈ కాలుష్యం వల్ల సగటు మనిషి ఆయుష్షు కూడా తగ్గిపోతున్నది. భారత్లో కాలుష్య తీవ్రతకు సంబంధించి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ చికాగోకు చెందిన ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్(ఈపీఐసీ) మంగళవారం విడుదల చేసిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్(ఏక్యూఎల్ఐ) నివేదికలో ఆందోళనకర విషయాలు వెల్లడించింది.
భారత్లో సగటు పౌరుడి ఆయుర్దాయం భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉందని, అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాలు పాటిస్తే ఆయుష్షు మెరుగయ్యే అవకాశం ఉందని పేర్కొన్నది. దేశంలోనే అత్యధిక కాలుష్య నగరంగా ఉన్న రాజధాని ఢిల్లీలో కాలుష్య స్థాయి ప్రస్తుతం ఉన్న విధంగానే కొనసాగితే ప్రజలు 10 ఏండ్ల ఆయుష్షు కోల్పోతారని నివేదిక వెల్లడించింది. ఉత్తర భారతదేశంలో 51 కోట్ల మంది ఆయుర్దాయం 7.6 సంవత్సరాలు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
దేశంలో తగ్గనున్న సగటు పౌరుడి ఆయుష్షు-5 ఏండ్లు
పీఎం2.5 స్థాయిలు