AIIMS | ఎయిమ్స్ సైబర్ సెక్యూరిటీపై మరోసారి దాడి జరిగింది. అయితే, పెద్దగా నష్టమేమి జరుగలేదని, కొద్ది సమయంలోనే సర్వీసులను పునరుద్ధరించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపారు. సమాచారం ప్రకారం.. ఎయిమ్స్పై మంగళవారం మధ్యాహ్నం 2.50 గంటలకు మాల్వేర్ దాడి జరిగింది. ఎయిమ్స్లోని సైబర్ భద్రతా వలయం సైబర్ ఎటాక్ను అడ్డుకుందని అధికార వర్గాలు తెలిపాయి. ఎయిమ్స్ ఈ హాస్పిటల్ సేవలకు సంబంధించి వెబ్సైట్కు ఇబ్బందులు లేవని, సాధారణంగానే పని చేస్తున్నాయని తెలిపారు. సైబర్ దాడి తర్వాత కొంత సేపు సేవలు ప్రభావితమయ్యాయి. గత ఆరు నెలల కిందట సైబ్ దాడి జరుగడడంతో ఎయిమ్స్లోని అన్ని సర్వీసులపై ప్రభావం పడింది. ఆ తర్వాత ఎయిమ్స్ సైబర్ సెక్యూరిటీని మరింత పటిష్టం చేసింది.