హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఇంటర్న్షిప్ ద్వారా విద్యార్థులు చదువుకొంటూనే పరిశ్రమల పనితీరును తెలుసుకోవచ్చు. అంతేగాక, నైపుణ్యాలను సాధించుకోవడంతోపాటు ప్రత్యక్ష అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇటీవలికాలంలో ఇంటర్న్షిప్ను అన్ని విద్యాసంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. విద్యార్థులు కూడా ఉత్సాహంగా ఇంటర్న్షిప్లలో చేరుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ అన్న తేడా లేకుండా పలు సంస్థలు ఇంటర్న్షిప్కు అవకాశం కల్పిస్తున్నాయి. కొన్ని సంస్థలు సొంతంగా విద్యార్థులే వెతుక్కోవాలని సూచిస్తుండగా, మరికొన్ని నిర్దేశిత రంగంలో, నిర్దేశిత కంపెనీలోనే ఇంటర్న్షిప్ను ప్రోత్సహిస్తున్నాయి.
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ బిట్స్ కూడా ఇంటర్న్షిప్ను అమలుచేస్తున్నది. కోర్సు కాలవ్యవధిలో 4 నుంచి 5 ఇంటర్న్షిప్లను విద్యార్థులు పూర్తిచేసే అవకాశాన్ని ఇచ్చింది. రాష్ట్రంలోనూ విరివిగా ఇంటర్న్షిప్ అవకాశాలను విద్యార్థులు సైతం అందిపుచ్చుకొంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇంటర్న్షిప్ల సమస్త సమాచారాన్ని అందజేయడానికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) చర్యలు చేపట్టింది. ఇంటర్న్షిప్ల సమాచారాన్ని ఏఐసీటీఈ ఇంటర్న్షిప్ వెబ్పోర్టల్లో పొందుపరిచింది.
ఇంటర్న్షిప్లో లాభాలు..