హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారికి గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్కు చెందిన వికాస్కుమార్ కిశోర్భాయ్ రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టు కోసం డీడీని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డికి ఇచ్చారు.
అనకాపల్లి ఎస్పీ కేవీ మురళీకృష్ణ రూ.2 లక్షల విలువైన కూరగాయలు అందించారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయని చైర్మన్ భూమన తెలిపారు.