హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): మార్క్ఫెడ్ను బలోపేతం చేసేలా సిబ్బంది పని చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. మార్ఫెడ్ నూతన వ్యాపార ప్రతిపాదనలపై శుక్రవారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడారు. మార్కెట్లో డిమాండ్ ఆధారంగా పత్తి, కందులు, మొకజొన్న, మిరపకాయలు, పసుపు పంటల సేకరణకు గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు. కందులను పప్పుగా మార్చి మారెటింగ్ చేసే అవకాశాలు పరిశీలించాలని కోరారు. ఆదిలాబాద్లోని మార్ఫెడ్ సొంత ప్రెస్సింగ్ యూనిట్లో పత్తిసేకరణ, పత్తి బేళ్ల మార్పిడికి అవకాశాలపై అధ్యయనం చేయాలని చెప్పారు.
వేరుశనగ ప్రాసెసింగ్ ప్లాంట్లు, వేరుశనగ ఉత్పత్తులను సిద్ధం చేయడానికి, అధ్యయనం కోసం గుజరాత్ రాష్ర్టాన్ని సందర్శించాలని సూచించారు. కచ్చితమైన హామీ ప్రాతిపదికన వాణిజ్య సేకరణ ద్వారా అవసరమైన మొకజొన్న సరఫరా కోసం ఇతర రాష్ర్టాలతో ఒప్పందం కుదుర్చుకునే అంశాలను పరిశీలించాలని పేర్కొన్నారు. జీవ, సేంద్రియ, ద్రవ రూప ఎరువుల సరఫరా అవకాశాలపై చర్చించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం రఘునందన్రావు, మార్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, పాలకవర్గ సభ్యులు రంగారావు, విజయ్కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం యాదిరెడ్డి, జనరల్ మేనేజర్ బీ విష్ణువర్ధన్రావు తదితరులు పాల్గొన్నారు.