హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది రాష్ట్రంలోకి రుతుపవనాల రాక ఆలస్యమవడం, వర్షాలు సాధారణ స్థాయిలోనే కురుస్తాయన్న అంచనాలు వెలువడుతుండటంతో రైతులు తదనుగుణంగా పంటలు సాగు చేసేలా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వానకాలం పంటల సాగుపై శనివారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ.. వరిలో కూనారం సన్నాలు, కూనారం 1638, బతుకమ్మ, వరంగల్ 962, ఆర్ఎన్ఆర్ 21278, ఆర్ఎన్ఆర్ 29325, జగిత్యాల 1798, తెలంగాణ సోనా, ఎంటీ యూ 1010, జగిత్యాల 24423, ఐఆర్ 64, హెచ్ఎంటీ, సోనా లాంటి స్వల్పకాలిక రకాలను మాత్రమే సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని, యాసంగిలో అకాల వర్షాల వల్ల వరికి నష్టం వాటిల్లకుండా చూసేందుకు పంట కాలాన్ని ముందు కు జరిపేలా అవగాహన కల్పించాలని చెప్పా రు. ఇందుకోసం వ్యవసాయ శాఖ రూపొందించిన వీడియోను మంత్రి విడుదల చేశారు.
రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనా లు అందుబాటులో ఉన్నాయని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. మార్ఫెడ్లో తగినంత బఫర్ స్టాక్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎరువుల సరఫరా, వినియోగంపై అన్ని జిల్లాల్లో దృష్టి కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఏడా ది కొత్తగా 2 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇ ప్పటికే 60 వేల ఎకరాల్లో సాగుకు రైతులు ముందుకు వచ్చారని వెల్లడించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు కొండిబ, హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ నాగరత్న, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్, విత్తన సంస్థ ఎండీ కేశవులు, అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్, ఉద్యాన శాఖ జేడీ సరోజినీ తదితరులు పాల్గొన్నారు.
సంప్రదాయ వ్యవసాయం నుంచి రైతులు బయటకు రావాలని, ఆధునిక పరిశ్రమగా వ్యవసాయం వర్ధిల్లాలని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. కన్హా శాంతివనంలో సమున్నతి సంస్థ నిర్వహించిన ‘లైట్ హౌస్ కాంక్లేవ్ ఎఫ్పీవో 2023’ కార్యక్రమంలో ఆయన మాట్లాడు తూ.. రాష్ట్రంలో రైతు ఉత్పత్తి సంఘాలను ప్రో త్సహిస్తున్నట్టు తెలిపారు. ఎఫ్పీవోల ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, వీటి సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో సమున్నతి సంస్థ సీఈవో అనిల్కుమార్, డైరెక్టర్ ప్రవేశ్శర్మ, డాక్టర్ వెంకటేశ్ తగత్, ఏపీఎంఏఎస్ సీఈవో సీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.