వనపర్తి, సెప్టెంబర్ 10: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం వనపర్తిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. సృష్టికి ప్రతి సృష్టి చేసే వాళ్లు విశ్వకర్మలు అని, రాతికి రూపం ఇచ్చి దేవుడిని చేస్తారని కొనియాడారు.
వ్యవసాయానికి అవసరమైన నాగలి, కర్రు, గొర్లు, మేడితోక చేసేది వీరేనని తెలిపారు. తెలంగాణ కోసం ఆచార్య జయశంకర్ జీవితాంతం పాటుపడ్డారని గుర్తు చేశారు. అలాంటి మహనీయుడిని అందరూ స్మరించుకోవాలనే ఉద్దేశంతో పట్టణంలో జయశంకర్ రాక్గార్డు పార్కును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. త్వరలోనే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు.
అంతకుముందు నియోజకవర్గం అభివృద్ధిపై రూపొందించిన డ్యాకుమెంటరీ ప్రదర్శనను విశ్వకర్మలు తిలకించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల వద్ద నిర్మించిన పంప్హౌస్, రిజర్వాయర్ సందర్శన సమయంలో ప్రాజెక్టు గొప్పతనాన్ని.. పాలమూరు వెనుకబాటును అద్భుతంగా వివరించిన ప్రణ వ శ్లోకను మంత్రి అభినందించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మూసాపేట మం డలం మహమ్మద్ హుస్సేన్పల్లికి చెందిన ఐదుగురికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.