హైదరాబాద్, మే 28(నమస్తే తెలంగాణ) : పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందొద్దని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీజన్కు కావాల్సిన అన్ని రకాల పంటల విత్తనాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
కంపెనీలతో చర్చించి 1.26 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టామని, 49.71 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంటే 9.20 లక్షల ప్యాకెట్లు విక్రయించామని పేర్కొన్నారు.