హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్రావుకు ప్రతిష్ఠాత్మక ఎంఎస్ స్వామినాథన్ అవార్డు దక్కింది. బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయు డు అవార్డును ప్రదానం చేశారు. వ్యవసాయరంగం అభివృద్ధికి ప్రవీణ్రావు చేస్తున్న కృషిని గుర్తించిన రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయిస్ అసోసియేషన్, నూజివీడు సీడ్స్ సంయుక్తంగా అవార్డును అందించాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. సాగు విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. రైతులను యాంత్రీకరణ దిశగా ప్రోత్సహిస్తే అధిక లాభాలు గడించవచ్చని చెప్పారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పండించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పాల్గొన్నారు.