జగిత్యాల : తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ (Mla Sanjay Kumar) వెల్లడించారు. జగిత్యాల పట్ణణ కేంద్రం బీఆర్ఎస్(BRS) కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీ(Medical College) ఏర్పాటు ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా విద్య అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు.కళాశాలలో రెండవ సంవత్సరం విద్యకు అనుమతి వచ్చిందని అన్నారు.రాష్ట్రంలో 12 లక్షల మంది పేదలకు కల్యాణ లక్ష్మి(Kalyana laxmi), షాదీ ముబారక్(Shadi Mubarak) చెక్లను ప్రభుత్వం అందజేసిందన్నారు. ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తుందని అన్నారు.
అంగన్ వాడీ,ఆశా వర్కర్లు జీతాలు పెంచి గౌరవం గా చూస్తుందని వెల్లడించారు. ఎమ్మెల్సీ రమణ(Mlc Ramana) మాట్లాడుతూ ప్రభుత్వం ఏటా రూ. 12 వేల కోట్లు సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తుందని, ఇందులో కేంద్రంలో వాటా శూన్యమనిఅన్నారు.మహిళలకు భారం అయ్యే విధంగా గ్యాస్ ధరలు పెంచిదని ఆరోపించారు.
నిత్యావసరాలు, పాలు, పాల ఉత్పత్తుల పై జీఎస్టీ(GST) పెంచడం దారుణమని అన్నారు.
మోదీ ప్రభుత్వం అదానీ కి లాభం చేకూర్చే విధంగా కార్యక్రమాలు ఉన్నాయని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయని వెల్లడించారు.