BJP MLA Rajasingh | గోషా మహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరామ నవమి నేపథ్యంలో అనుమతి లేకుండా భారీగా భక్తులతో శోభయాత్ర నిర్వహించారని రాజా సింగ్పై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన పోలీసులు అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో రాజా సింగ్ పై కేసు నమోదు చేశారు. అంతే కాదు ప్రధాన ర్యాలీ వెళుతుండగా గౌలిగూడ వద్ద నిలిపి పటాకులు కాల్చారని పోలీసులు ఆరోపించారు. శోభయాత్ర పొడవునా ర్యాలీని నిలిపి ప్రస్తంగిస్తూ, భక్తులు, ట్రాఫిక్కు అంతరాయం కలిగించారని పోలీసులు పేర్కొన్నారు. రాజా సింగ్ తోపాటు జోగేందర్ సింగ్ బిట్టూపైనా కేసు నమోదు చేశారు.