AE Eaxms | రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో వివిధ ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లోని అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టులకు సంబంధించిన పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నగరంలోని ఆయా ప్రాంతాల నుంచి అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా, తిరిగి ఇంటికి వచ్చేందుకు ప్రత్యేకంగా బస్సులను నడుపనున్నది. బస్సులు ఎక్కడంతో పాటు దిగడానికి ఇబ్బంది లేకుండా బస్టాప్ల వద్ద ప్రత్యేకంగా అధికారులను నియమించడంతో పాటు స్టాప్లలో బస్సులను సక్రమంగా ఆపడం, అవసరమైన రూట్లో వెళ్లేలా అభ్యర్థులకు ఆర్టీసీ సిబ్బంది మార్గనిర్దేశం చేయనున్నారు.
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు మార్గనిర్దేశం చేయడానికి, పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక కార్యకలాపాలను పర్యవేక్షించడానికి బస్ స్టేషన్లలో సూపర్వైజర్తో ప్రత్యేక హెల్ప్డెస్క్లను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. కోఠి (సెల్:9959226160), రైత్ఫైలి (9959226154) బస్స్టేషన్ల వద్ద కమ్యూనికేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అభ్యర్థులకు బస్సులకు సంబంధించిన సమాచారం కోసం ఆయా నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.