హైదరాబాద్: కేటీఆర్తోపాటు అడ్వకేట్ను విచారణకు ఏసీబీ అధికారులు అనుమతించాల్సిందని అడ్వకేట్ సోమ భరత్ (Advocate Rama Bharat) అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద లాయర్ కలిసి వెళ్లడం ప్రతి పౌరునికి ఉన్న హక్కు అని చెప్పారు. అడ్వకేట్ను ఏసీబీ ఆఫీస్ లోపలికి ఎందుకు రానివ్వలేదని, దానివల్ల వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. మీరు లోపల కుట్ర చేయాలి అనుకోకపోతే అడ్వకేట్ను ఎందుకు వద్దంటున్నారు. కోర్టులో తీర్పు రిజర్వ్లో ఉంది. ఈ జడ్జిమెంట్ వచ్చేవరకు ఓపిక పట్టి మాకు టైం ఇవ్వండని ఏసీబీ వాళ్లకు ఒక లెటర్ ఇచ్చాం. ఈ లెటర్ ఇవ్వడానికి కలిసి వెళ్లాం. అడ్వకేట్ సహాయకుడిగా రావడం అనేది ఫండమెంటల్ రైట్.
రాజ్యాంగం ఇచ్చి హక్కును కూడా కాలదన్నే పద్ధతుల్లో మీరు అడ్వకేట్లను తీసుకు రావద్దు అనడం ఏంటి. ఇటీవల కూడా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇవ్వని స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు రాసుకున్నారు.. ఇవాళ అది జరగకూడదని మేము కలిసి వెళ్లామన్నారు. కేసు విచారణ కోర్టు పరిధిలో ఉందని, ఫార్ములా-ఈకు సంబంధించి డాక్యుమెంట్లు ప్రభుత్వం వద్ద ఉన్నాయని తెలిపారు.
మీరు లోపల కుట్ర చేయాలి అనుకోకపోతే అడ్వొకేట్ను ఎందుకు వద్దంటున్నారు
కోర్టులో తీర్పు రిజర్వ్లో ఉంది.. ఈ జడ్జిమెంట్ వచ్చేవరకు ఓపిక పట్టి మాకు టైం ఇవ్వండని ఏసీబీ వాళ్లకు ఒక లెటర్ ఇచ్చాము
ఈ లెటర్ ఇవ్వడానికి కలిసి వెళ్ళాము.. అడ్వొకేట్ సహాయకుడిగా రావడం అనేది ఫండమెంటల్ రైట్… pic.twitter.com/2MFdwDTZiY
— Telugu Scribe (@TeluguScribe) January 6, 2025