హైదరాబాద్ : రాష్ట్రంలో మరో ఎనిమిది వైద్య కళాశాలలకు తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, భూపాలపల్లి, జనగామ, ఆసిఫాబాద్ వైద్య కళాశాలల ఏర్పాటుకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. ప్రతి కాలేజీలో వంద ఎంబీబీఎస్ సీట్లు ఉండేలా ఏర్పాట్లు చేసింది. రూ.1,479కోట్ల వైద్య కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది.
అయితే, ఆయా భవనాల నిర్మాణాల బాధ్యతలను ఆర్అండ్బీ అప్పగించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, టీఎస్ఎంఎస్ఐడీసీ రాజన్న సిరిసిల్లలోని మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆసుపత్రిని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆర్అండ్బీ ఇంజినీర్ ఇన్ చీఫ్కు సూచించింది.