ఆదిలాబాద్: తెలంగాణ కశ్మీర్ ఆదిలాబాద్ (Adilabad) జిల్లాను మంచు దుప్పటి కమ్మేసింది. పల్లెలే కాదు జిల్లా కేంద్రంపై దట్టంగా మంచు అలముకున్నది. ఉదయం 8 గంటలవుతున్నా పొగ మంచు కురుస్తూనే ఉన్నది. పొగ మంచు కారణంగా 44వ నంబర్ కశ్మీర్-కన్యాకుమారి జాతీయ రహదారిపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందు ఏమీ కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణం సాగిస్తున్నారు. పొగమంచుకు చలి తోడవడంతో ప్రజలు వణికిపోతున్నారు.
ఇక నిజామాబాద్ జిల్లాలో కూడా పొగమంచు కురుస్తున్నది. ఇందూరు పట్టణంలో ఉదయం 8 గంటలవుతున్న పొగ మంచు తీవ్రంగా ఉండటంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.