భద్రాద్రి: దక్షిణాది అయోధ్యలో భద్రాద్రి శ్రీరామచంద్ర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. సోమవారం నుంచి ఈ నెల 23 వరకు ముక్కోటి ఏకాదశి వరకు మహోత్సవాలు జరుగుతాయి. శ్రీరామచంద్రుడు రేపటి నుంచి రోజుకో రూపంలో దర్శనమివ్వనున్నాడు. మహోత్సవాల్లో భాగంగా పగల్ పత్తు, రాపత్తు, విలాస ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 12న గోదావరిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. 13న స్వామివారు భక్తులకు ఉత్తర ద్వార దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల నేపథ్యంలో రేపటి నుంచి ఈ నెల 13 వరకు నిత్య కల్యాణాలను అధికారులు రద్దు చేశారు.
జనవరి 3- మత్స్యావతారం
జనవరి 4- కూర్మావతారం
జనవరి 5- వరాహావతారం
జనవరి 6- నరసింహావతారం
జనవరి 7- వామనావతారం
జనవరి 8- పరశురామావతారం
జనవరి 9- శ్రీరామావతారం
జనవరి 10- బలరామావతారం
జనవరి 11- శ్రీకృష్ణావతారం