హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నాంపల్లిలోని బజార్ఘాట్ అగ్నిప్రమాద ఘటనలో అగ్నిమాపక సిబ్బంది స్పందన అభినందనీయమని ఆ శాఖ ఏడీజీ వై నాగిరెడ్డి కొనియాడారు. తక్షణమే స్పందించిన సిబ్బంది ధైర్యంతో 17 మంది పౌరుల ప్రాణాలను కాపాడారని కొనియాడారు. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందిని శనివారం ఆయన సత్కరించి, నగదు రివార్డులతోపాటు ప్రశంసాపత్రాలను అందజేశారు.
గుడ్ సర్వీస్ ఎంట్రీ నామినేషన్కు ఆదేశాలు జారీ చేశారు. ఫోన్ కాల్ స్వీకచరించిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మం టల్లో చిక్కుకున్న బాధితులను తమ ప్రాణాలకు తెగించి క్షేమంగా కిందికి తీసుకురావడం గొప్ప విషయమని ఏడీజీ కొనియాడారు. ఏడీజీ నుంచి ప్రశం సా పత్రం అందుకున్న వారిలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు కే చంద్రశేఖర్, కే వెంకర నాగేంద్ర, పీ బసంత్, లీడిం గ్ ఫైర్మెన్లు నాగయ్య, పవన్రెడ్డి, డ్రైవర్ ఆపరేటర్ వినోద్కుమార్, ఫైర్మెన్లు బీవీఎన్ మూర్తి, ఆర్ ఆదర్శ్, ఎండీ ఐజాజ్ ఉన్నారు.