ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 29 : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్టైం అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్టైం టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆదివారం జరుగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తమ సమస్యలపై చర్చించాలని కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. తమ సమస్య సీఎం కేసీఆర్ దృష్టికి వెళితే పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రికి వినతిపత్రం ఇచ్చిన వారిలో అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ సోమేశ్వర్ బోనకుర్తి, డాక్టర్ ఆరుట్ల జానకిరెడ్డి, డాక్టర్ జూలు నాగేశ్వర్, డాక్టర్ శంకర్, డాక్టర్ విష్ణుభూపతి తదితరులు ఉన్నారు.