నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం నార్కట్ పల్లి క్యాంపు కార్యాలయంలో చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి 100 మంది ఆరూరి శ్రీశైలం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. నిరంతరం ప్రజల కోసం పని చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామన్నారు. అనంతరం పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.