నిజామాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. తాజాగా మోర్తాడ్ మండలంలోని బీఎస్పీ పార్టీ నుంచి సునీల్ రెడ్డి అతడి ప్రధాన అనుచరులు సంగం అనిల్, ఎలాల ప్రకాష్ ఆదివారం హైదరాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.
వారికి గులాబీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అందరూ కలిసి కట్టుగా పార్టీ పటిష్టానికి కృషి చేయాలన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.
కార్యక్రమంలో మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జెడ్పీటీసీ బద్దం రవి, సర్పంచ్ బోగ ధరణి , ఎంపీటీసీలు శాస్త్రి,రాజ్ పాల్,డిసిసిబి డైరెక్టర్ మోత్కు భూమన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాపాయి పవన్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు పర్స దేవన్న, గోపిడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.